బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేస్తాం: సీతారాం ఏచూరి

ABN , First Publish Date - 2022-01-09T22:31:13+05:30 IST

బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేస్తామని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేస్తాం: సీతారాం ఏచూరి

హైదరాబాద్: బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేస్తామని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరగకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ఆయా రాష్ట్రాల్లో పొత్తులపై నిర్ణయాలు తీసుకుంటామని, 5 రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా కృషి చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని సీతారాం ఏచూరి తప్పుబట్టారు.


‘‘బీజేపీపై కేసీఆర్ పోరాటంలో లోపముంది. బీజేపీని కొన్ని విషయాల్లో మాత్రమే కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. బీజేపీపై కేసీఆర్ సాఫ్ట్ కార్నర్‌కు మేం వ్యతిరేకం. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేస్తాం’’ అని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.


Updated Date - 2022-01-09T22:31:13+05:30 IST