డంప్‌యార్డు ఏర్పాటుకు స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-05-18T05:56:32+05:30 IST

ఆత్మకూరు మున్సిపాలిటీ డంప్‌యార్డు ఏర్పాటుకై సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసు, మేనేజర్‌ వెంకటేశ్వర్లు సిద్దేపల్లి రస్తాలో స్థల పరిశీలన చేశారు.

డంప్‌యార్డు ఏర్పాటుకు స్థల పరిశీలన

ఆత్మకూరు, మే 17: ఆత్మకూరు మున్సిపాలిటీ డంప్‌యార్డు ఏర్పాటుకై సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసు, మేనేజర్‌ వెంకటేశ్వర్లు సిద్దేపల్లి రస్తాలో స్థల పరిశీలన చేశారు. వాస్తవానికి ఆత్మకూరు మున్సిపాలిటీకి సరైన డంప్‌యార్డు లేకపోవడంతో పట్టణ శివార్లలోని రహదారులకు ఇరువైపుల చెత్తనిల్వలు వేస్తున్నారు. దీనివల్ల ఆ గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో వుంచుకున్న మున్సిపల్‌ అధికారులు ఆత్మకూరు పట్టణానికి రెండు కిమీల దూరంలో ఉండే  సిద్దేపల్లి రస్తాలోని సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు.  వీరి వెంట డీఈ నరేష్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ సునీల్‌రాజు, వైసీపీ నాయకులు ఎంఏ.రషీద్‌ ఉన్నారు. 

Updated Date - 2021-05-18T05:56:32+05:30 IST