డిగ్రీ కళాశాలకు స్థల పరిశీలన
ABN , First Publish Date - 2021-12-09T04:48:07+05:30 IST
ఇంగిలిగాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన భూములను జేసీ విజయసునీత బుధవారం పరిశీలించారు.
పలాస: ఇంగిలిగాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన భూములను జేసీ విజయసునీత బుధవారం పరిశీలించారు. నెమలికొండకు ఆనుకొని ఉన్న ఈ స్థలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుకూలంగా ఉంటుందని తహసీల్దార్ ఎల్.మధుసూదనరావు ఆమెకి వివరించారు. హైవేతో పాటు పలాస- కాశీబుగ్గ జంటపట్టణాలకు మధ్యలో ఈ ప్రాంతం ఉండడంతో విద్యార్థులకు బస్సు ఇబ్బందులు ఉండవని అధికారులు జేసీకి వివరించారు. ఆమె వెంట టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్మర్మట్, ఆర్ఐ రవికుమార్, సర్వేయర్ చలపతిరావు ఉన్నారు.