డిగ్రీ కళాశాలకు స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-12-09T04:48:07+05:30 IST

ఇంగిలిగాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన భూములను జేసీ విజయసునీత బుధవారం పరిశీలించారు.

డిగ్రీ కళాశాలకు స్థల పరిశీలన
డిగ్రీ కళాశాల నిర్మించే స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ

పలాస: ఇంగిలిగాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన భూములను జేసీ విజయసునీత బుధవారం పరిశీలించారు. నెమలికొండకు ఆనుకొని ఉన్న ఈ స్థలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుకూలంగా ఉంటుందని తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు ఆమెకి వివరించారు.  హైవేతో పాటు పలాస- కాశీబుగ్గ జంటపట్టణాలకు మధ్యలో ఈ ప్రాంతం ఉండడంతో విద్యార్థులకు బస్సు  ఇబ్బందులు ఉండవని అధికారులు జేసీకి వివరించారు. ఆమె వెంట టెక్కలి సబ్‌ కలెక్టర్‌ వికాస్‌మర్మట్‌, ఆర్‌ఐ రవికుమార్‌, సర్వేయర్‌ చలపతిరావు ఉన్నారు. 

 



Updated Date - 2021-12-09T04:48:07+05:30 IST