ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆరు అంబులెన్స్లు అందించిన ఎంపీ నామా
ABN , First Publish Date - 2021-01-18T04:34:45+05:30 IST
ఉమ్మడి జిల్లా వాసుల అత్యవసర వైద్యసేవల కోసం ఎంపీ నామ నాగేశ్వరరావు రూ.1.23కోట్లు వెచ్చించి సమకూర్చిన ఆరు అంబులెన్సులను ఆయన.. ఖమ్మం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందించారు.
ప్రారంభించిన ఎంపీ నామా నాగేశ్వరరావు
ఖమ్మంసంక్షేమవిభాగం, జనవరి 17: ఉమ్మడి జిల్లా వాసుల అత్యవసర వైద్యసేవల కోసం ఎంపీ నామ నాగేశ్వరరావు రూ.1.23కోట్లు వెచ్చించి సమకూర్చిన ఆరు అంబులెన్సులను ఆయన.. ఖమ్మం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందించారు. ఆదివారం ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన వాటి తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ఈ వాహనాలతో ప్రభుత్వ వైద్యసేవలు మరింతగా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఖమ్మం మేయర్ డాక్టర్ పాపాలాల్, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని స్వర్ణకుమారి మాట్లాడుతూ దేశంలో అత్యధిక అంబులెన్స్లు అందించిన ఘనత ఎంపీ నామా నాగేశ్వరరావుకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి మెనేజర్ ఆర్వీఎస్ సాగర్, ల్యాబ్ టెక్నీషియన్ నందగిరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.