America వెళ్తూ ఆరుగురు భారతీయులు అదృశ్యం

ABN , First Publish Date - 2022-01-26T23:17:55+05:30 IST

టర్కీ మీదుగా అమెరికా వెళ్లే క్రమంలో ఆరుగురు భారతీయులు అదృశ్యమైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇస్తాంబుల్‌లోని ఇండియన్ ఎంబసీ ఇప్పటికే ఈ విషయంపై దృష్టిసారించగా ఇ

America వెళ్తూ ఆరుగురు భారతీయులు అదృశ్యం

ఎన్నారై డెస్క్: టర్కీ మీదుగా అమెరికా వెళ్లే క్రమంలో ఆరుగురు భారతీయులు అదృశ్యమైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇస్తాంబుల్‌లోని ఇండియన్ ఎంబసీ ఇప్పటికే ఈ విషయంపై దృష్టిసారించగా ఇక్కడి పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


గుజరాత్‌లోని కలోల్ తాలుకాకు చెందిన తేజస్ పటేల్ కొద్ది రోజుల క్రితం తన భార్య అల్క పటేల్, కొడుకు దివ్య పటేల్‌తో కలిసి అమెరికాకు బయల్దేరాడు. సరిగ్గా ఇదే సమయంలో సురేష్ పటేల్ తన భార్య శోభ, కూతరు ఫోరమ్‌ కలిసి యూఎస్ వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. టర్కీ మీదుగా అమెరికా వెళ్లే క్రమంలో ఈ రెండు కుటుంబాలు ఇస్తాంబుల్ చేరుకున్నాయి. తాజాగా వీరితో వాళ్ల కుటుంబ సభ్యులకు కమ్యునికేషన్ కట్ అయింది. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఇస్తాంబుల్‌లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు. దీంతో ఎంబసీ అధికారులు అక్కడి అధికారులను అలర్ట్ చేశారు. కాగా.. ఈ విషయంపై సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా వెళ్లే క్రమంలో ఈ రెండు కుటుంబాలు ఇస్తాంబుల్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చట్ట విరుద్ధంగా అమెరికా వెళ్లేందుకు ఇస్తాంబుల్‌కు చేరుకున్నారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా విదేశీయులను అక్రమంగా అమెరికాకు తరలించే ముఠానే వీళ్లని కిడ్నాప్ చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 



కాగా.. పోలీసులు ఇలా అనుమానం వ్యక్తం చేయడానికి బలమైన కారణమే ఉంది. తాజాగా గుజరాత్‌కు చెందిన కుటుంబం రక్తం గడ్డకట్టే చలిలో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలోనే తేజస్ పటేల్, సురేష్ పటేల్‌లు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలోకి ఎంటరయ్యేందుకు ప్రయత్నించి ఉంటారని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తేజస్ పటేల్, సరేష్ పటేల్ ఏ గ్రామానికి చెందిన వారనే విషయాన్ని మాత్రం పోలీసులు బయటపెట్టడం లేదు. 




Updated Date - 2022-01-26T23:17:55+05:30 IST