భారతీయులను వరించిన అదృష్టం!

ABN , First Publish Date - 2021-04-17T06:46:42+05:30 IST

యూఏఈలో నివసిస్తున్న ఆరుగురు భారతీయులను అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో జాక్‌పాట్ కొట్టారు. ఏకంగా ఒక మిలియన్ దిర్హమ్‌లను ఉమ్మడిగా గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన రాబర్ట్(69),

భారతీయులను వరించిన అదృష్టం!

అబుధాబి: యూఏఈలో నివసిస్తున్న ఆరుగురు భారతీయులను అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో జాక్‌పాట్ కొట్టారు. ఏకంగా ఒక మిలియన్ దిర్హమ్‌లను ఉమ్మడిగా గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన రాబర్ట్(69), మహ్మద్ (35), ఇబ్రహీం అబ్దుల్‌తోపాటు మరోముగ్గరు భారతీయులు తాజాగా ఓ లాటరీ టికెట్టును కొనుగోలు చేశారు. ఈ క్రమంలో వారు కొన్న టికెట్ల‌కు జాక్‌పాట్ తగిలింది. ఆరింట ఐదు నెంబర్లు సరిపోలడంతో ఏకంగా 1 మిలియన్ దిర్హమ్‌లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.2.03కోట్లు) ఉమ్మడిగా గెలుచుకున్నారు. ఈ క్రమంలో రాబర్ట్ స్పందించారు. లాటరీ టికెట్ కొనుగోలు చేసిన మొదటిసారే జాక్‌పాట్ తగలడంతో ఆనందం వ్యక్తం చేశారు. తాను గెలుచుకున్న మొత్తాన్ని తన కూతురికి పెళ్లి కానుకగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మహ్మద్ మాట్లాడుతూ.. లక్కీ డ్రాలో గెలుచుకున్న డబ్బును తన బిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-17T06:46:42+05:30 IST