రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
ABN , First Publish Date - 2021-10-21T05:33:07+05:30 IST
నాగంపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయాలపాలయ్యారు.
చీపురుపల్లి: నాగంపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సంకుపాలేం గ్రామానికి చెందిన గోవింద్, అతని కుమారుడు ప్రకాశ్, మరో యువకుడు వంశీ బైకుపై చీపురుప ల్లి వైపు వస్తుండగా నాగంపేట సమీపంలో ఉన్న తోటపల్లి కాలువ వద్ద టైరు పంక్చర్ అయ్యింది. దీంతో వారు ఎదురుగా వస్తున్న సత్యవతి అనే ఉపాధ్యా యురాలి స్కూటీని, మెట్టపల్లి ఉన్నత పాఠ శాల హెచ్ఎం భానుమ తి కారును వరుసగా ఢీకొట్టారు. ఈ సంఘట నలో సత్యవతి, భాను మతితో పాటు బైక్పై ప్రయాణిస్తున్న గోవింద్ కు స్పల్ప గాయాల య్యాయి. ప్రకాష్, వంశీ లు తీవ్రంగా గాయప డ్డారు. క్షతగాత్రుల్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.