ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-06-20T04:57:02+05:30 IST

మండల పరిధిలోని సుద్ధపల్లె గ్రామ సమీపాన పంట పొలాల్లో జరుగుతున్న పేకాట స్థావరంపై శనివారం పెద్దముడియం ఎస్‌ఐ శివప్రసాద్‌ దాడులు నిర్వహించి ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

పెద్దముడియం, జూన్‌ 19: మండల పరిధిలోని సుద్ధపల్లె గ్రామ సమీపాన పంట పొలాల్లో జరుగుతున్న పేకాట స్థావరంపై శనివారం పెద్దముడియం ఎస్‌ఐ శివప్రసాద్‌ దాడులు నిర్వహించి ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈదాడిలో వారి వద్ద నుంచి రూ.46 వేలు నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

 ప్రజలకు అండగా ఉండాలి

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 19:  పట్టణంలో పాలకపక్షాలు విగ్రహాల గొడవలు వీడి కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇన్‌ఛార్జి పీజా దస్తగీర్‌ పేర్కొన్నా రు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటనలో పాలకులు, ప్రతిపక్షాలు విగ్రహాల కోసం కొట్లాడుకోవడం బాధాకరమన్నారు. 

Updated Date - 2021-06-20T04:57:02+05:30 IST