వణుకుతున్న నాయుడుపేట
ABN , First Publish Date - 2020-04-05T09:49:02+05:30 IST
ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే నాయుడుపేటలో కరోనా కలకలం రేపింది. ఆరు పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదవడంతో ప్రజలు వణికిపోతున్నారు.
రెడ్ అలర్ట్తో ప్రజల్లో ప్రశాంతత
నిర్వీరామంగా పనిచేస్తున్న పోలీస్, మున్సిపల్, వైద్య సిబ్బంది
నాయుడుపేట, ఏప్రిల్ 4 : ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే నాయుడుపేటలో కరోనా కలకలం రేపింది. ఆరు పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదవడంతో ప్రజలు వణికిపోతున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య యుద్ధప్రాతిపాదిన చర్యలు చేపట్టారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులతో సమీక్షించి తక్షణమే రెడ్ అలర్ట్ను ప్రకటించారు.
దీంతో శనివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే పాలు, నిత్యావసర సరుకులు ప్రజలు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి పూర్తిస్థాయి కర్ఫ్యూ కొనసాగింది. వారం రోజులపాటు ఇది కొనసాగనుంది. మరోవైపు పోలీస్, మున్సిపల్, వైద్య సిబ్బంది ఎవరికివారుగా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నారు. పట్టణంలో అడుగడుగునా బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ విస్తృతంగా పిచికారీ చేస్తున్నారు.