పురంలో మరో ఆరు పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-05-23T10:38:52+05:30 IST

కరోనా వైరస్‌ హిందూ పురంలో కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా శుక్రవారం అంబేడ్కర్‌నగర్‌లో ఐదుగురికి,

పురంలో మరో ఆరు పాజిటివ్‌ కేసులు

హిందూపురం, మే 22 : కరోనా వైరస్‌ హిందూ పురంలో కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా శుక్రవారం అంబేడ్కర్‌నగర్‌లో ఐదుగురికి, అజాద్‌నగర్‌లో మరొకరికి వైరస్‌ సోకింది. వీరిలో నలుగురు 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు. ఇప్పటికే వెలుగుచూసిన పాజిటివ్‌ కేసుల్లో వృద్ధులే అధికంగా ఉ న్నారు. గురువారం కె బసవనపల్లిలో కూరగాయల తోపుడు బండి వ్యాపారికి వైరస్‌ సోకినట్టు తెలియడంతో గ్రామంతోపాటు పట్టణంలో కూరగాయలు కోనుగోలు చేసిన వారిలో కాంటాక్ట్‌ ఆందోళన నెలకొంది.

  

కరోనా ఫుల్‌.. ఖాళీ అవుతున్న క్వారంటైన్‌ కేంద్రాలు

పట్టణంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 146కు చేరుకుంది. ఈకేసుల మొదటి, రెండవ కాంటాక్ట్‌ అనుమా నితులతో పాటు కరోనా లక్షణాలు ఉన్న వారిని అధికార యంత్రాం గం క్వారంటైన్‌కు తరలిస్తోంది. ఇందుకోసం పట్టణంలో మూడు క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పది రోజు ల కిందటి వరకు వందల మందితో క్వారంటైన్‌ కేంద్రాలు నిండి ఉండేవి.


వారం రోజులుగా ఈ కేంద్రాలు ఖాళీ అవు తున్నాయి. సప్తగిరిలో మాత్రమే శుక్రవారం సాయంత్రా నికి 76 మంది దాక ఉన్నట్లు చెబుతున్నారు. పట్టణంలో పాజిటివ్‌ కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో కాంటాక్ట్‌ను గుర్తించినా కొందరు క్వారంటైన్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానితుల్ని తరలించేం దుకు అధికార యంత్రాంగం ప్రయత్నించినా ఓవర్గం ప లు రకాల ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యం లోనే క్వారంటైన్‌ క్రమంగా ఖాళీ అవుతూ స్వీయ నిర్బం ధం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.  

Updated Date - 2020-05-23T10:38:52+05:30 IST