నల్గొండ జిల్లాలో తొలిసారిగా ఆరు పాజిటీవ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-02T20:58:33+05:30 IST

జిల్లాలో తొలిసారిగా ఆరు పాజిటీవ్ కేసులు ఒక్కరోజే నమోదు కావడంతో..

నల్గొండ జిల్లాలో తొలిసారిగా ఆరు పాజిటీవ్ కేసులు

నల్గొండ: జిల్లాలో తొలిసారిగా ఆరు పాజిటీవ్ కేసులు ఒక్కరోజే నమోదు కావడంతో కలకలం రేపుతోంది. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన నల్గొండ పట్టణానికి చెందిన ఐదుగురుకి, మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఒక మహిళకు పాజిటీవ్ అని తేలింది. ఢిల్లీకి వెళ్లివచ్చిన మరికొందరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండలరావు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇవాళ విదేశాలనుంచి వచ్చినవారు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిపై దృష్టి పెట్టడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం విదేశాలనుంచి వచ్చినవారు 399 మంది ఉన్నారని, వారంతా క్వారంటైన్ పీరియడ్ పూర్తి చేశారని తెలిపారు. 


ఈ దశలో ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 45 మంది లిస్టు తనవద్ద ఉందని కొండలరావు తెలిపారు. వారికి పరీక్షలు నిర్వహించి హైదరాబాద్, ఫీవర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. అందులో 34 మందికి నెగిటీవ్ వచ్చిందని.. హోం క్వారంటైన్‌లో ఉంచామన్నారు. మరో ఆరుగురికి పాజిటీవ్ వచ్చిందని.. వారిని పీవర్ ఆస్పత్రిలో ఉంచామన్నారు. వారి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ కొండలరావు చెప్పారు.

Updated Date - 2020-04-02T20:58:33+05:30 IST