ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-09-18T14:02:52+05:30 IST
పూందమల్లి, తిరువేర్కాడు, పొన్నేరి ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆరుగురు విద్యా ర్థులకు కరోనా సోకింది. పూందమల్లి సమీపం సెన్నీర్కుప్పంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి
చెన్నై: పూందమల్లి, తిరువేర్కాడు, పొన్నేరి ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆరుగురు విద్యా ర్థులకు కరోనా సోకింది. పూందమల్లి సమీపం సెన్నీర్కుప్పంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి, 11 తరగతి చదువుతున్న విద్యార్థులకు, తిరువేర్కాడు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థికి పొన్నేరిలో పాఠశాల విద్యార్థి, ఇద్దరు కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి.. దీనితో ఈ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కరోనా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.