తల్లిని కొడుతున్నాడనే కోపంతో తండ్రిని చంపిన కుమార్తె

ABN , First Publish Date - 2020-10-23T18:29:56+05:30 IST

ప్రతీరోజూ పీకలదాకా మద్యం తాగి తల్లిని కొడుతున్నాడనే కోపంతో కన్న తండ్రిని....

తల్లిని కొడుతున్నాడనే కోపంతో తండ్రిని చంపిన కుమార్తె

భోపాల్ (మధ్యప్రదేశ్): ప్రతీరోజూ పీకలదాకా మద్యం తాగి తల్లిని కొడుతున్నాడనే కోపంతో కన్న తండ్రిని ఐరన్ రాడ్డుతో కొట్టి చంపిన కూతురి ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది. తన తండ్రి నిత్యం మద్యం తాగివచ్చి తల్లిని కొడుతుండటం చూసిన 16 ఏళ్ల కుమార్తె ఆగ్రహంతో ఐరన్ రాడ్డు తీసుకొని తండ్రిని కొట్టి చంపింది. అనంతరం 100 నంబరుకు ఫోన్ చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. నిరుద్యోగి అయిన తండ్రి మేస్త్రీ అయిన కుమారుడి సంపాదనపై ఆధారపడి జీవనం గడుపుతూ ప్రతీరోజూ తాగి వచ్చి తల్లిని కొడుతున్నాడు. 


పెద్దకుమారుడి పెళ్లి గురించి మాట్లాడుతుండగా తండ్రి మద్యం తాగి వచ్చి గొడవ చేస్తుండటంతో కోపంతో కుమార్తె తండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిందని పోలీసులు చెప్పారు. పోలీసులు బాలికపై కేసు నమోదు చేసి ఆమెను బాలికల సదనానికి తరలించారు.

Updated Date - 2020-10-23T18:29:56+05:30 IST