మేని కాంతికి మసూర్దాల్!
ABN , First Publish Date - 2020-03-12T06:07:56+05:30 IST
మూడు టేబుల్స్పూన్ల మసూర్దాల్లో టేబుల్ స్పూన్ తేనె వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. రోజు విడిచి రోజు వారంలో....
మూడు టేబుల్స్పూన్ల మసూర్దాల్లో టేబుల్ స్పూన్ తేనె వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. రోజు విడిచి రోజు వారంలో మూడుసార్లు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, ఎర్ర మచ్చలు తగ్గిపోతాయి.
చర్మం నిర్జీవంగా మారినప్పుడు రెండు టేబుల్ స్పూన్ల మసూర్దాల్ పొడిలో టేబుల్ స్పూన్ పాలు పోసి పేస్ట్ మాదిరి చేసుకోవాలి. 20 నిమిషాలు తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి.
మసూర్దాల్ పొడిలో టేబుల్ స్పూన్ బాదం నూనె, టేబుల్ స్పూన్ పాలు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ను ఫేస్మాస్క్లా అప్లై చేస్తే నల్ల మచ్చలు పోతాయి.