రూ.2.65 కోట్లతో రహదారుల నిర్మాణం

ABN , First Publish Date - 2020-09-27T11:08:24+05:30 IST

మండలంలో తారు రోడ్ల నిర్మాణానికి రూ. 2.65 కోట్లు మంజూరుచేసినట్లు డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌ తెలిపారు.

రూ.2.65 కోట్లతో రహదారుల నిర్మాణం

 డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌ 

ఇచ్ఛాపురం రూరల్‌: మండలంలో తారు రోడ్ల నిర్మాణానికి  రూ. 2.65 కోట్లు మంజూరుచేసినట్లు డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌ తెలిపారు. శనివారం బాలకృష్ణాపురంలో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ఈ నిధులతో పనులు త్వరలో ప్రారంభంకానున్నాయని చెప్పారు.


బాలకృష్ణాపురం నుంచి ముచ్చింద్ర వరకు రూ.92 లక్షలు, బాలకృష్ణాపురం నుంచి బెన్నుగానిపేటకు రూ. 45 లక్షలు,పాతశాసనం నుంచి జరడా(ఒడిశా)వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.25 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. పంచాయతీరాజ్‌ డీఈ బి.ధనుంజయరావు, జేఈ ఎం.శ్రీనివాసరావు,మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, చాట్ల తులసిదాస్‌, ఉప్పాడ రాజారెడ్డి, బెందాళం ప్రకాష్‌, రామపత్ని చిట్టిబాబు, పి.మామయ్య,ఆశి కృష్ణారెడ్డి, బి.మోహనరావు, ఆర్‌.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T11:08:24+05:30 IST