నలుగురు వలంటీర్లకు షోకాజ్
ABN , First Publish Date - 2020-10-01T11:05:52+05:30 IST
మాలగోవిందపురంలో విధులు సక్రమంగా నిర్వహించని నలుగురు గ్రామ వలంటీర్లకు అధికారులు షోకాజ్నోటీసులు జారీచేశారు.
సోంపేట రూరల్: మాలగోవిందపురంలో విధులు సక్రమంగా నిర్వహించని నలుగురు గ్రామ వలంటీర్లకు అధికారులు షోకాజ్నోటీసులు జారీచేశారు. బుధవారం బేసిరామచంద్రపురం, సుంకిడి, మాలగోవిందపురం, మాకన్నపురం గ్రామ సచివాలయాలను ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.అనంతరం సచివాలయ, వైద్య సిబ్బంది, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధినిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.