నలుగురు వలంటీర్లకు షోకాజ్‌

ABN , First Publish Date - 2020-10-01T11:05:52+05:30 IST

మాలగోవిందపురంలో విధులు సక్రమంగా నిర్వహించని నలుగురు గ్రామ వలంటీర్లకు అధికారులు షోకాజ్‌నోటీసులు జారీచేశారు.

నలుగురు వలంటీర్లకు షోకాజ్‌

సోంపేట రూరల్‌: మాలగోవిందపురంలో విధులు సక్రమంగా నిర్వహించని నలుగురు గ్రామ వలంటీర్లకు అధికారులు షోకాజ్‌నోటీసులు జారీచేశారు. బుధవారం బేసిరామచంద్రపురం, సుంకిడి, మాలగోవిందపురం, మాకన్నపురం గ్రామ సచివాలయాలను ఎంపీడీవో సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి  పరిశీలించారు.అనంతరం సచివాలయ, వైద్య సిబ్బంది, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధినిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

Updated Date - 2020-10-01T11:05:52+05:30 IST