ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-10-01T11:04:09+05:30 IST
పాగోడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దనామాలపేట గ్రామానికి చెందిన అడపా భాస్కరరావు (47) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... మంగళవారం రాత్రి బుడితి కూడలి
జలుమూరు: పాగోడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దనామాలపేట గ్రామానికి చెందిన అడపా భాస్కరరావు (47) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... మంగళవారం రాత్రి బుడితి కూడలి నుం చి నడుచుకుంటూ వస్తున్న పెద్దనామాలపేటకు చెందిన భాస్కరరావు, నామాన మోహనరావులను చెన్నాయివలసకు చెందిన బొమ్మాళి ప్రసాద్ ద్విచక్ర వాహనంతో ఢీకొన్నాడు.
ఈ ఘటనలో భాస్కర్ తలకు బలమైన గాయం కాగా మోహన్కు స్వల్ప గాయాలయ్యాయి. భాస్కర్ను 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతిచెందాడు. భాస్కరరావుకు భార్య దమయంతి, కుమారుడు మహేష్, కుమార్తె ఉన్నారు. దమయంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ డి.రాములు తెలిపారు.