13 మంది బైండోవర్
ABN , First Publish Date - 2020-10-01T11:05:04+05:30 IST
మండలంలో 13 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్.ఐ వై.కృష్ణ తెలిపారు.
జలుమూరు: మండలంలో 13 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్.ఐ వై.కృష్ణ తెలిపారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో 11 మంది రౌడీషీటర్లు కాగా మరో ఇద్దరు అనుమానితులు ఉన్నారని తెలిపారు.