కొవ్వూరులో అర్థరాత్రి స్వల్ప ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-04-10T23:11:22+05:30 IST
జిల్లాలో గల కొవ్వూరు పట్టణంలోని భవ్య టవర్స్ వద్ద అర్థరాత్రి స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు
పశ్చిమ గోదావరి: జిల్లాలో గల కొవ్వూరు పట్టణంలోని భవ్య టవర్స్ వద్ద అర్థరాత్రి స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరు నెలల క్రితం చీటీల పేరుతో కోట్లాది రూపాయలకు టోకరా వేసి ఓ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు పట్టణం నుంచి పరారయ్యాడు. రాత్రి సమయంలో భవ్యటవర్స్కు తమ సామానును తరలించేందుకు ప్రస్తుతం అతని కుటుంబసభ్యులు యత్నం చేశారు. విషయం తెలుసుకున్న చీటీ ఖాతాదారులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. వివాదం పెద్దగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఖాతాదారులకు పోలీసులు సర్ది చెప్పి పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.