స్మృతీ.. బయటికి రావద్దు!
ABN , First Publish Date - 2020-04-02T10:03:57+05:30 IST
భారత మహిళల జట్టు బ్యాట్స్వుమన్ స్మృతీ మంధానను ఇంటినుంచి బయటికి రావద్దని మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా అధికారులు సూచించారు. టీ20 వరల్డ్కప్ ఫైనల్...
ముంబై: భారత మహిళల జట్టు బ్యాట్స్వుమన్ స్మృతీ మంధానను ఇంటినుంచి బయటికి రావద్దని మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా అధికారులు సూచించారు. టీ20 వరల్డ్కప్ ఫైనల్ (మార్చి 8) తర్వాత రెండురోజులకు ముంబై చేరుకున్న మంధాన అక్కడ 14 రోజులున్న అనంతరం మార్చి 23న తన స్వస్థలం సాంగ్లీ చేరుకుంది. అయితే ఆ పట్టణంలో ఒకే కుటుంబంలో 25 మందికి కరోనా సోకడంతోపాటు, వేగంగా విజృంభిస్తుండడంతో ముందు జాగ్రత్తగా ఆమెను క్వారంటైన్లో ఉండాలని సాంగ్లీ వైద్యాధికారి సూచించారు.