ఘనంగా స్మగ్లర్ veerappan 17వ వర్ధంతి

ABN , First Publish Date - 2021-10-19T15:10:23+05:30 IST

పేరుమోసిన గంధపు చెక్కల స్మగ్లర్‌గా ఇరురాష్ట్రాల పోలీసులను గడగడలాడించిన వీరప్పన్‌ 17వ వర్ధంతిని సోమవారం పాటించారు. రాష్ట్ర ఎస్టీఎఫ్‌ బలగాలు 2004 అక్టోబరు 18వ తేదీ ధర్మపురి సమీపంలోని పాపార్‌పట్టి

ఘనంగా స్మగ్లర్ veerappan 17వ వర్ధంతి

ప్యారీస్‌(chennai): పేరుమోసిన గంధపు చెక్కల స్మగ్లర్‌గా ఇరురాష్ట్రాల పోలీసులను గడగడలాడించిన వీరప్పన్‌ 17వ వర్ధంతిని సోమవారం పాటించారు. రాష్ట్ర ఎస్టీఎఫ్‌ బలగాలు 2004 అక్టోబరు 18వ తేదీ ధర్మపురి సమీపంలోని పాపార్‌పట్టిలో ఎన్‌కౌంటర్‌ జరిపి వీరప్పన్‌ను హతమార్చారు. వీరప్పన్‌ భౌతికకాయాన్ని సేలం జిల్లా మేట్టూరు సమీపంలో ఉన్న మూలక్కాడు కావేది నదితీరంలో ఖననం చేశారు. ప్రతి ఏడాది వీరప్పన్‌ వర్ధంతి రోజును పురస్కరించుకొని ఆయన కుటుంబసభ్యులు, మద్దతుదారులు సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తుంటారు. ఆ రీతిలో 17వ వర్ధంతి సందర్భంగా వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి, కుమార్తె విద్యారాణి తదితరులు సమాధి వద్ద పూజలు నిర్వహించి అంజలి ఘటించారు.`



Updated Date - 2021-10-19T15:10:23+05:30 IST