థమ్స్ అప్ బాటిల్లో త్రాచు పాము
ABN , First Publish Date - 2021-03-21T01:24:36+05:30 IST
థమ్స్అప్ బాటిల్లో త్రాచు పాము పిల్ల కనబడడంతో
తూర్పు గోదావరి: థమ్స్అప్ బాటిల్లో త్రాచు పాము పిల్ల కనబడడంతో కలకలం రేగింది. ఈ ఘటన జిల్లాలోని అమలాపురం మండలంలో జరిగింది. మండలంలోని పేరూర్ వై జంక్షన్లో బెంగళూరు బేకరీ ఉంది. అక్కడికి ఓ వ్యక్తి వచ్చి థమ్స్అప్ బాటిల్ కొన్నాడు. అయితే బాటిల్లో త్రాచు పాము పిల్ల కనబడడంతో అతను ఖంగుతిన్నాడు. థమ్స్అప్ బాటిల్లో త్రాచు పాము పిల్ల ఉందనే విషయం మండలంలో దావానంలా వ్యాపించింది. వేసవిలో శీతల పానీయాలు తాగాలంటే ఇకముందు జాగ్రత్తగా ఉండాల్సిందే .