చేపల మార్కెట్‌ వద్ద భౌతిక దూరం

ABN , First Publish Date - 2021-05-17T04:35:22+05:30 IST

రాపూరు క్రాస్‌ రోడ్డు వద్ద చేపల మార్కెట్‌ల్లో గత ఆదివారం రద్దీగా ఉండడంతో ‘ఆంధ్రజ్యోతి’లో ఇలా ఉంటే కరోనా రాదా అనే కథనం వచ్చింది.

చేపల మార్కెట్‌ వద్ద భౌతిక దూరం
చేపల మార్కెట్‌ వద్ద భౌతిక దూరం ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఐ అనూష

16 వీజీఆర్‌టీ 1: చేపల మార్కెట్‌ వద్ద భౌతిక దూరం ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఐ అనూష

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

వెంకటగిరి(టౌన్‌), మే 16: రాపూరు క్రాస్‌ రోడ్డు వద్ద చేపల మార్కెట్‌ల్లో గత ఆదివారం రద్దీగా ఉండడంతో ‘ఆంధ్రజ్యోతి’లో ఇలా ఉంటే కరోనా రాదా అనే కథనం వచ్చింది. స్పందించిన అధికారులు చేపల మార్కెట్‌ వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని ఎస్‌ఐ అనుషా ప్రజలను కోరారు. వైసీపీ సీనియర్‌ నాయకుడు కలిమిలి రాంప్రసాద్‌ రెడ్డి చేపల మార్కెట్‌కు వచ్చే వారికి మాస్క్‌లు ఉచితంగా అందించి జాగ్రత్తలు వివరించారు.

Updated Date - 2021-05-17T04:35:22+05:30 IST