అనంతపురం జిల్లాలో సోషల్ మీడియా వివాదం
ABN , First Publish Date - 2021-12-01T21:38:15+05:30 IST
జిల్లాలో సోషల్ మీడియా వివాదం తారాస్థాయికి
అనంతపురం: జిల్లాలో సోషల్ మీడియా వివాదం తారాస్థాయికి చేరింది. పెద్దవడుగూరు మండలం చిన్న వడుగూరు గ్రామంలో సోషల్ మీడియా కారణంగా వివాదం తలెత్తింది. పెట్టిన పోష్టింగ్కు అసభ్య పదజాలంతో వ్యతిరేకంగా కామెంట్ పెట్టారని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఒక వైసీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి ఉద్రికత్తంగా ఉంది.