డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
ABN , First Publish Date - 2020-12-03T20:11:15+05:30 IST
డ్రగ్స్ అమ్ముతూ ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎన్ఫోర్స్మెంట్కు అడ్డంగా దొరికిపోయారు.
హైదరాబాద్: డ్రగ్స్ అమ్ముతూ ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎన్ఫోర్స్మెంట్కు అడ్డంగా దొరికిపోయారు. గోవా, విశాఖపట్టణం ఏజేన్సీల నుంచి మాదక ద్రవ్యాలను తీసుకువచ్చి విక్రయిస్తూ హైదరాబాద్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కు చిక్కిపోయారు. మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన శివసేనారెడ్డి, వనస్థలిపురం కమలానగర్ వాసి మేక సాయి, ఘట్కేసర్ పోచారంలోని సింగపూర్ టౌన్షిప్ నివాసి హర్షవర్ధన్ ప్రముఖ సంస్థల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం తార్నాకలో వారిని అరెస్టు చేసింది. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.