లంక లీగ్‌లో జట్టును కొన్న సల్మాన్‌ తమ్ముడు

ABN , First Publish Date - 2020-10-22T08:59:03+05:30 IST

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌ లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ఒక జట్టును కొనుగోలు చేశాడు.

లంక లీగ్‌లో జట్టును  కొన్న సల్మాన్‌ తమ్ముడు

ముంబై: బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌ లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ఒక జట్టును కొనుగోలు చేశాడు. స్వతహాగా సినీ నిర్మాతైన సొహైల్‌ టీ20 క్రికెట్‌పై ఆసక్తితో ఎల్‌పీఎల్‌లోని క్యాండీ జట్టును సొంతం చేసుకున్నాడు. ఈ జట్టు తరఫున వెస్టిండీస్‌ విధ్యంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ ఆడనున్నాడు. గేల్‌తో పాటు లంక ఆటగాళ్లు కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌, నువాన్‌ ప్రదీప్‌, ఇంగ్లండ్‌ పేసర్‌ ప్లంకెట్‌ ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. వచ్చే నవంబరు 21న ప్రారంభం కానున్న ఈ లీగ్‌ డిసెంబరు 13 వరకు హంబన్‌తోట, పల్లెకెలే మైదానాల్లో జరగనుంది. దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు డుప్లెసి, జమైకా సిక్సర్ల పిడుగు ఆండ్రీ రస్సెల్‌, లంక మాజీ కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ వంటి స్టార్లు లీగ్‌లోని ఇతర జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు.

Updated Date - 2020-10-22T08:59:03+05:30 IST