సరిహద్దుల్లో పాక్ కాల్పులు...భారత జవాన్ మృతి

ABN , First Publish Date - 2020-06-05T13:50:45+05:30 IST

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.....

సరిహద్దుల్లో పాక్ కాల్పులు...భారత జవాన్ మృతి

 శ్రీనగర్(జమ్మూకశ్మీర్): పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టారులోని సరిహద్దుల్లో గురువారం రాత్రి పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత జవాన్ ఒకరు అమరుడయ్యారు. పాకిస్తాన్ సైనికుల కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు. సుందర్ బనీ సెక్టారు లక్ష్యంగా చేసుకొని పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. భారత సైనికుల ఎదురుకాల్పులు జరపడంతో పాక్ సైనికులు తోకముడిచారు. సరిహద్దుల్లో పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తరచూ కాల్పులకు దిగుతుండటంతో భారత సైనికులు వాటిని తిప్పి కొట్టారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Updated Date - 2020-06-05T13:50:45+05:30 IST