డ్యూటీకి వెళ్లిన మిలిటరీ భర్త.. యువతితో భర్త సోదరుడి విక‌ృత చేష్టలు.. జరిగిన విషయం భర్తకు చెప్పగా అతనేం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-23T09:14:58+05:30 IST

19 ఏళ్ల వయసులో ఓ యువతికి మిలిటరీ సైనికుడితో వివాహం జరిగింది. పెళ్లైన తరువాత భర్త దేశ సరిహద్దుల వద్ద డ్యూటీకి వెళ్లాడు. ఆ సమయంలో భర్త సోదరుడు(అన్న) ఆ యువతిపై అత్యాచారం చేశాడు. ఇలా 18 ఏళ్లుగా ఆమెపై అత్యాచారం చేస్తూ నరకయాతనకు గురి చేస్తున్నాడు...

డ్యూటీకి వెళ్లిన మిలిటరీ భర్త.. యువతితో భర్త సోదరుడి విక‌ృత చేష్టలు..  జరిగిన విషయం భర్తకు చెప్పగా అతనేం చేశాడంటే..

19 ఏళ్ల వయసులో ఓ యువతికి మిలిటరీ సైనికుడితో వివాహం జరిగింది. పెళ్లైన తరువాత భర్త దేశ సరిహద్దుల వద్ద డ్యూటీకి వెళ్లాడు. ఆ సమయంలో భర్త సోదరుడు(అన్న) ఆ యువతిపై అత్యాచారం చేశాడు. ఇలా 18 ఏళ్లుగా ఆమెపై అత్యాచారం చేస్తూ నరకయాతనకు గురి చేస్తున్నాడు. ఒకరోజు ఆమె భరించలేక ఇంటికి వచ్చిన భర్తకు జరిగుతున్న దారుణాన్ని వివరించింది. ఇది విన్న ఆమె భర్త ఏం చేశాడంటే..


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరానికి చెందిన జమున(37, పేరు మార్చబడినది)కు 19 ఏళ్ల వయసులో భారత సైన్యంలో పనిచేసే రవికుమార్(పేరు మార్చబడినది)తో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజుల తరువాత రవికుమార్‌ ఉద్యోగ రీత్యా దేశ సరిహద్దు రక్షణ కోసం బోర్డర్ వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో రవికుమార్ అన్న జీతేంద్ర.. జమునపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. అలా జమున భయంతో ఆ దుర్మార్తుడి వికృత చేష్టలకు రోజూ బలయ్యేది. ఇంట్లో ఆ కీచకుడే పెద్ద దిక్కు కావడంతో ఆమె నరకం అనుభవించేది. భర్త ఎప్పుడు ఇంటికి వచ్చినా నోరు విప్పడానికి భయపడేది. ఇలా 18 ఏళ్లు గడిచిపోయాయి.


ఒకరోజు జీతేంద్ర చెప్పినట్లు జమున వినకపోవడంతో ఆమెను చితకబాదాడు. దీంతో జమున ఇక భరించేదిలేదని నిర్ణయించుకుంది. ఇంటికి వచ్చిన భర్త రవికుమార్‌కు ఇంట్లో ఇన్నాళ్లుగా జరిగుతున్న అన్యాయం గురించి వివరించింది. ఇది విన్న రవికుమార్ షాక్‌కు గురయ్యాడు. ఇంట్లో పెద్దవాడైన తన అన్న జీతీంద్రను ఎదిరించడానికి భయపడ్డాడు. కొన్ని రోజుల తరువాత యథావిధిగా మళ్లీ డ్యూటీకి వెళ్లిపోయాడు. ఆ తరువాత జీతేంద్ర కీచక పర్వం మళ్లీ మొదలైంది. దీంతో జమున భర్తకు ఫోన్ చేసి ఏం చేయాలో అడిగింది. దానికి రవి కుమార్ సమాధానంగా.. 'ఇంట్లో జరుగుతున్న విషయం గురించి ఇంటి బయటకు పోకూడదు.. అన్నదమ్ముల మధ్య ఇలాంటివి జరగడం సహజం' అని జమునతో చెప్పాడు. ఇది విని జమున ఆశ్చర్యపోయింది.  ఇక సహించకూడదని నిర్ణయించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.


పోలీసులు జీతేంద్రపై అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అలాగే రవికుమార్‌పై కూడా నిందితుడికి సహకరించినందుకు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-01-23T09:14:58+05:30 IST