పోలీసు అమరులకు ఘననివాళి

ABN , First Publish Date - 2021-10-22T05:14:47+05:30 IST

పోలీసు అమరులకు ఘననివాళి

పోలీసు అమరులకు ఘననివాళి
తాండూరు రూరల్‌: కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద పోలీసు అమరులకు నివాళులర్పిస్తున్న సీఐ జలందర్‌రెడ్డి

తాండూరు రూరల్‌/తాండూరు/బషీరాబాద్‌/నవాబుపేట/మేడ్చల్‌: పోలీసుల అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు మండలం కరన్‌కోట్‌ రూరల్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద పోలీసులు నివాళులర్పించారు. రూరల్‌ సీఐ జలందర్‌రెడ్డి అమరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఏడుకొండలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం తాండూరు మండలం కరన్‌కోట్‌ గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్‌ నాయకులు బోయ అశోక్‌కుమార్‌ నివాళులర్పించారు. అదేవిధంగా పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద అమరులైన పోలీసులకు ఏబీవీపీ నాయకులు నివాళులర్పించారు. నాయకుడు ఉప్పల రాజేష్‌ మాట్లాడుతూ విధినిర్వహణలో అమరులైన పోలీసుల సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్‌గౌడ్‌, మౌనేశ్వరిచారి, మణికొండల్‌రెడ్డి, విష్ణు, లక్ష్మణ్‌, శివ, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్‌లో ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. అదేవిధంగా నవాబుపేటలో  మండల కేంద్రంలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి గార్డెన్‌ అండ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఎస్‌ఐ వెంకటేశం అమరులైన పోలీసుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య, ఎక్బాల్‌, ప్రభాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, పట్లోళ్ల భరత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మేడ్చల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోలీసు అమరులకు నివాళులర్పించారు.  కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, సర్పంచ్‌ సురేందర్‌ముదిరాజ్‌, ఎస్‌ఐలు రఘురాం, మనోహర్‌, నాయకులు పోచయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సంజీవరావు, ఎర్రోల్ల కృష్ణ, గోపాల్‌, మురళీగౌడ్‌, వెంకటేష్‌యాదవ్‌, సుధాకర్‌, కార్తీక్‌రెడ్డి, జనగాం నాగరాజు, శ్రీశైలం పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:14:47+05:30 IST