ఎన్టీఆర్కు ఘన నివాళి
ABN , First Publish Date - 2022-01-19T05:16:30+05:30 IST
ఎన్టీ రామారావు 26వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళి అర్పించారు.
కర్నూలు(అగ్రికల్చర్)/కల్లూరు: ఎన్టీ రామారావు 26వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళి అర్పించారు. చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేశారు. టీడీపీ 14 నియోజకవర్గాల ఇనచార్జిలు, ఇతర నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
- నగరంలో కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇనచార్జి టీజీ భరత తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు.
- నంద్యాల లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు మాధవనగర్లోని తన నివాసంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలుగుగంగ ప్రాజెక్టును నిర్మించి భూములను సస్యశ్యామలం చేయడమే కాకుండా.. ఇతర జిల్లాలకు తాగునీరు అందించిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు.