స్వరాజ్య పాదయాత్రకు సంఘీభావం
ABN , First Publish Date - 2022-01-24T05:55:12+05:30 IST
దళిత శక్తి ప్రొగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారాదన్ మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టబోయే 10వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రకు గోదావరిఖనికి డీఎస్పీ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.
కళ్యాణ్నగర్, జనవరి 23: దళిత శక్తి ప్రొగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారాదన్ మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టబోయే 10వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రకు గోదావరిఖనికి డీఎస్పీ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ఆదివారం మున్సిపల్ టీ జం క్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వరాజ్య పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ జిల్లా కన్వీనర్ మాడుగుల సదానందం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈనెల 1 నుంచి నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కొనసాగుతుందని, ఈ పాదయాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ టీ జంక్షన్ నుంచ లక్ష్మీనగర్ వరకు పాదయాత్ర నిర్వహించాడు. రామగుండం మండల అధ్యక్షుడు కనకం గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిట్టపల్లి శంకర్, రొంటాల చిరంజీవి, శంకర్, భరత్, కండె రవీందర్, మాతంగి తిరుపతి, అశోక్, రాజ్కుమార్, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.