దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-06-04T10:01:48+05:30 IST
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు అధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, సర్వే ల్యాండ్ ఏడీ కమిటీగా ఏర్పడండి
కలెక్టర్ ఎస్.వెంకట్రావు
మహబూబ్నగర్ కలక్టరేట్, జూన్ 3: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమవేశంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యల పాత, కొత్త రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, సర్వే ల్యాండ్ ఏడీ కమిటీగా ఏర్పడి దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యల పరిష్కారాలను వేగవంతం చేయాలని చెప్పారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలక్టర్ సీతారామారావు, మహబూబ్నగర్ ఆర్డీఓ శ్రీనివాస్, సర్వేల్యాండ్ ఏడీ శ్యాంసుందర్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.