ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

ABN , First Publish Date - 2021-05-11T05:18:06+05:30 IST

ఆశావర్కర్ల సమస్కలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక 1వ ఆరోగ్య ఉపకేంద్రం ముందు సోమవారం ఆశావర్కర్లు, సీఐటీయూ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరంచి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

కోడుమూరు, మే 10: ఆశావర్కర్ల సమస్కలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక 1వ ఆరోగ్య ఉపకేంద్రం ముందు సోమవారం ఆశావర్కర్లు, సీఐటీయూ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరంచి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు గఫూర్‌మియ్య మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న వేళ ఆశావర్కర్లు వాళ్ల ప్రాణాలను తెగించి రోగులకు సేవలు అందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశావర్కర్లుకు రూ.50లక్షల బీమా కల్పిస్తామని చెప్పి ఇంత వరకు అమలు చేయలేదన్నారు.  బీమా సౌకర్యంతోపాటు రూ.18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు, సీఐటీయూ నాయకులు సువేద, మద్దమ్మ, రాజి, సువర్చన, సరోజ, వీరన్న పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T05:18:06+05:30 IST