‘న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలి’
ABN , First Publish Date - 2020-07-07T10:19:35+05:30 IST
న్యాయవాదుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరిధర్, బషీర్ అన్నారు. ఆదోని బార్ అసోసియేషన్
ఆదోని, జూలై 6: న్యాయవాదుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరిధర్, బషీర్ అన్నారు. ఆదోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వంద కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లను తక్షణమే విడుదల చేయాలని భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్) సీనియర్ నాయకులు యల్లారెడ్డి, కారప్ప, చంద్రమోహన్గౌడ్ డిమాండ్ చేశారు. ఐఏఎల్ రాష్ట్ర పిలుపుమేరకు సోమవారం పత్తికొం డలో కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ పత్తికొండ యూనిట్ నాయకుడు సురేంద్రకుమార్ మాట్లాడుతూ మ్యాచింగ్గ్రాంట్ను తక్షణమే విడుదల చేసి లాక్ డౌన్తో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న జూనియర్ న్యాయవాదులకు బకాయిలు చెల్లించాలన్నారు.