నేరాలను ఛేదించడం ఛాలెంజ్గా తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-05-16T10:09:05+05:30 IST
క్రైం పార్టీ పోలీసులు నేరాలను చేధించడాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలని అడిషనల్ డీసీపీ జి. చంద్రమోహన్
కరీంనగర్ అడిషనల్ డీసీపీ జి. చంద్రమోహన్
కరీంనగర్ క్రైం, మే 15: క్రైం పార్టీ పోలీసులు నేరాలను చేధించడాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలని అడిషనల్ డీసీపీ జి. చంద్రమోహన్ అన్నారు. నేరాల ఛేదనే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కమిషనరేట్లో క్రైం పార్టీ పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టుదలతో కృషి చేస్తే ఎలాంటి కేసునైనా ఛేదించవచ్చన్నారు. ప్రస్తుత ఎండాకాలంలో దొంగతనాలు జరిగేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుందని క్రైంపార్టీ పోలీసులు అప్రమత్తంగా ఉంటూ నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు.
ప్రతి కేసును ఛేదించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని చెప్పారు. నేరాల నియంత్రణకు గస్తీని ముమ్మరంచేయనున్నామని చెప్పారు. నేరాల ఛేదనలో కీలకపాత్ర పోషించిన పోలీసులు, సమాచారం అందించిన వారికి రివార్డులను అందజేశారు.