అమ్మ ఒడి అందలేదని..

ABN , First Publish Date - 2021-01-21T05:37:16+05:30 IST

అమ్మఒడి డబ్బులు అందలేదని మండలంలోని మందలూరు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మ ఒడి అందలేదని..
మందలూరు సచివాలయం వద్ద చిన్నారులు, తల్లిదండ్రులు

  1. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన


రుద్రవరం, జనవరి 20: అమ్మఒడి డబ్బులు అందలేదని మండలంలోని మందలూరు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయానికి వచ్చారు. జగన్‌ మామా.. అమ్మఒడి ఇవ్వవా? అని విద్యార్థులు అడిగారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు సుమారు 30 మంది తమకు అమ్మఒడి పథకం అందలేదని అన్నారు. బ్యాంకు వద్ద వెళ్లి నిరాశతో వెనుతిరిగి వచ్చామని వాపోయారు. గత ఏడాది అమ్మఒడి వచ్చిందిగాని, ఈ ఏడాది రాలేదని అన్నారు. 


Updated Date - 2021-01-21T05:37:16+05:30 IST