నెల్లూరు జిల్లాలో భూ అక్రమాలపై విచారణ జరపాలి: టీడీపీ

ABN , First Publish Date - 2021-09-06T19:35:51+05:30 IST

నెల్లూరు: జిల్లాలోని భూ అక్రమాలపై విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.

నెల్లూరు జిల్లాలో భూ అక్రమాలపై విచారణ జరపాలి: టీడీపీ

నెల్లూరు: జిల్లాలోని భూ అక్రమాలపై విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పలువురు నేతలు జేసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాకుటూరులో రూ. కోట్ల విలువ చేసే భూములు మాయమైతే.. చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారని విమర్శించారు. పొదలకూరులో తహశీల్దార్ ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. వైసీపీ నేతలను చూసి అధికారులు భయపడుతున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-09-06T19:35:51+05:30 IST