వైసీపీ రాక్షసత్వానికి హద్దులు లేవా?
ABN , First Publish Date - 2020-12-01T06:18:51+05:30 IST
రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు పేట్రేగి పోతున్నారని, వీళ్ల రాక్షస త్వానికి హద్దు లేకుండాపోయిందని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
- ఆలయ పూజారులనే చితకబాదారు
- సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు(అగ్రికల్చర్), నవంబరు 30: రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు పేట్రేగి పోతున్నారని, వీళ్ల రాక్షస త్వానికి హద్దు లేకుండాపోయిందని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ బండి ఆత్మకూరు మండలం ఓం కారం క్షేత్రంలో అర్చకులపై చైర్మన్ ప్రతాపరెడ్డి దాడి చేశాడని ఆరోపించారు. ఎస్పీ వెంటనే దృష్టి సారించి ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.