పుష్కరాలపై శ్రద్ధ ఏదీ?

ABN , First Publish Date - 2020-10-24T11:09:56+05:30 IST

ప్రభుత్వానికి తుంగభద్ర పుష్కరాలపై శ్రద్ధ లేదని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంక టేశ్వర్లు ఆరోపించారు.

పుష్కరాలపై శ్రద్ధ ఏదీ?

 ప్రతి పనిలోనూ లాభంపైనే దృష్టి  

 సోమిశెట్టి వెంకటేశ్వర్లు 


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 23: ప్రభుత్వానికి తుంగభద్ర పుష్కరాలపై  శ్రద్ధ లేదని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంక టేశ్వర్లు ఆరోపించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి సెంట్రల్‌ ప్లాజా వరకు ప్రధాన రోడ్డు దుస్థితిని పరిశీలించారు. నిత్యం భారీగా వాహనాలు వెళ్లే  మెయిన్‌రోడ్డు గుంతల పడినా జిల్లా అధికారులకు గాని, వైసీపీ నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేదని అన్నారు. నవంబరు 20 నుంచి పుష్కరాలు జరగనున్నాయని పనులు పూర్తి చేయకపోవడంపై ధ్వజమెత్తారు. ఘాట్ల నిర్మాణంలో వైసీపీ నాయకులు బినామీ కాం ట్రాక్టర్లను నియ మించుకునేందుకే టెండర్లు పూర్తికాలేదని ఆరోపించారు. నాయకులు నాగేంద్రకుమార్‌, హనుమంతరావు చౌదరి, సత్రం రామక్రిష్ణుడు, జేమ్స్‌, అబ్బాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T11:09:56+05:30 IST