ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు
ABN , First Publish Date - 2020-08-11T17:19:20+05:30 IST
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.
విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ఆ పార్టీ నేతలు రాంమాధవ్, సతీష్ జీ.. సునీల్ దేవధర్, కన్నా లక్ష్మినారాయణ, పురంధేశ్వరి, విష్ణు, ఎమ్మెల్సీ మాధవ్, రావెల కిషోర్ బాబు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో బీజేపీ వాణి వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్కు బీజేపీ అవసరం ఉందని, ఏపీ అభివృద్ధే బీజేపీ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఉన్నాయని, ఏపీ అభివృద్ధికి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు.