నా వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తున్నారు: సోమువీర్రాజు
ABN , First Publish Date - 2022-01-28T21:33:20+05:30 IST
తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని బీజేపీ నేత సోమువీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప
అమరావతి: తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని బీజేపీ నేత సోమువీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా ప్రజలు హత్యలు చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య ఘటనను ఉద్దేశించి మాత్రమే.. వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తన వ్యాఖ్యలతో కడప జిల్లా ప్రజలకు ఎలాంటి సంబంధంలేదని సోమువీర్రాజు పేర్కొన్నారు. అంతకుముందు ప్రాణాలు తీసే ప్రాంతంలో కూడా ఎయిర్పోర్ట్లు కట్టించామని కడప ఎయిర్పోర్టును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాళ్లకు ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసని అన్నారు. ఎయిర్పోర్ట్ల విషయం కేంద్రం చూసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు సరిగా వేయాలని సోము వీర్రాజు సూచించారు.