ఏపీ ప్రభుత్వం క్లాప్ కార్యక్రమం నిర్వహణపై బీజేపీ అభ్యంతరం

ABN , First Publish Date - 2021-10-01T16:30:05+05:30 IST

స్వచ్ఛ్ భారత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఏపీ ప్రభుత్వం క్లాప్ కార్యక్రమం నిర్వహణపై బీజేపీ అభ్యంతరం

అమరావతి: స్వచ్ఛ్ భారత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. క్లీన్ ఏపీలో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్టాడుతూ వాహనాలపై సీఎం జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చిందని ఎద్దేవా చేశారు. స్వచ్ఛ భారత్ కింద కేంద్రం రూ.1015 కోట్ల నిధులను రాష్ట్రానికి కేటాయించిందన్నారు. ఈ చెత్త వాహానాలను ఇంత అందంగా తయారు చేయించడానికి నిధులు కూడా లేవని.. ఇవన్నీ కేంద్ర నిధులేనన్నారు. గ్రామ సచివాలయాలకు రంగులేసి కోర్టుతో చీవాట్లు తిన్నా ఈ ప్రభుత్వానికి బుద్దిరాలేదని, పద్ధతి మార్చుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ ఫొటో లేకుండా వాహనాలు ప్రారంభిస్తారా..? అంటూ ప్రశ్నించారు. వెంటనే మోదీ ఫొటో వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి చాలా నిధులు వస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని.. కేవలం తిట్ల దండకంతో సరిపెడుతోందని సోమ వీర్రాజు ఆరోపించారు.

Updated Date - 2021-10-01T16:30:05+05:30 IST