బీజేపీకి అధికారం ఇస్తే అమరావతిని రాజధానిగా చేస్తాం: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2022-01-03T20:15:34+05:30 IST
బీజేపీకి అధికారం ఇస్తే అమరావతిని రాజధానిగా చేయడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంచేశారు.
కృష్ణా: బీజేపీకి అధికారం ఇస్తే అమరావతిని రాజధానిగా చేయడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంచేశారు. సోమవారం వత్సవాయి మండలం గోపినేనిపాలెంలో సోము వీర్రాజు పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్ఆర్జిఎస్ నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న భవనాలకు జగన్ అన్న పేరు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. జగన్ సొంత నిధులుగా ప్రచారం చేయించుకోవటం తప్పని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం చేసింది శూన్యమని సోము వీర్రాజు మండిపడ్డారు.