చెరువులో దిగిన గేదెల కోసం వెళ్లి తండ్రీకొడుకుల మృతి

ABN , First Publish Date - 2020-08-10T14:50:28+05:30 IST

చెరువులోకి వెళ్లిన గేదెలను బయటికి రప్పించే క్రమంలో కొడుకు నీటిలో మునిగిపోతుండగా, తండ్రి కాపాడేందుకు చెరువులోకి దిగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి

చెరువులో దిగిన గేదెల కోసం వెళ్లి తండ్రీకొడుకుల మృతి

చెరువులో మునిగి తండ్రీ కొడుకుల మృతి

గేదెలను బయటకు రప్పిస్తుండగా ఘటన

పర్లపల్లిలో నెలకొన్న విషాదం


మొగుళ్ళపల్లి(భూపాలపల్లి జిల్లా): చెరువులోకి వెళ్లిన గేదెలను బయటికి రప్పించే క్రమంలో కొడుకు నీటిలో మునిగిపోతుండగా, తండ్రి కాపాడేందుకు చెరువులోకి దిగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... పర్లపల్లికి చెందిన పుల్యాల ఓదెలు(70), అతని కుమారుడు పుల్యాల మధుకర్‌(25) కలిసి పశువులను రోజూ మేతకు తోలుకెళ్లేవారు. ఈ క్రమంలో శనివారం తండ్రి ఓదెలు, కుమారుడు మధుకర్‌ పశువులను తోలుకెళ్లారు.


సాయంత్రం వేళ ఇంటికి పశువులతో వస్తుండగా రెండు గేదెలు పెద్ద చెరువులోకి వెళ్లాయి. వాటిని బయటకు రప్పించే క్రమంలో మధుకర్‌ చెరువులోకి దిగి నీటిలో మునిగిపోయాడు. గమనించిన తండ్రి ఓదెలు కొడుకును కాపాడేందుకు చెరువులోకి దిగగా ఆయన కూడా మునిగిపోయాడు. తండ్రి, కొడుకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెదకగా ఆదివారం చెరువులో ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఓదెలు పెద్ద కుమారుడు సాంబయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-10T14:50:28+05:30 IST