తల్లీకొడుకుపై కత్తులతో దాడి

ABN , First Publish Date - 2021-05-15T09:30:36+05:30 IST

తల్లీకొడుకుపై కత్తులతో దాడి

తల్లీకొడుకుపై కత్తులతో దాడి

తల్లి మృతి, కొడుకు పరిస్థితి విషమం

అమలాపురం, మే 14(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తల్లీకొడుకులపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. వివరాల్లోకెళితే.. అమలాపురం రూరల్‌ సమనస గ్రామానికి చెందిన కొండ్రు కోటేశ్వరరావు, మంగం చిరంజీవిల మధ్య పాతకక్షలు ఉన్నాయి. కోటేశ్వరరావుపై తొలుత చిరంజీవి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడగా అతడు పరారయ్యాడు. దాంతో అమలాపురం నుంచి వస్తున్న కోటేశ్వరరావు భార్య దుర్గ(45), కుమారుడు రమే్‌షలను లక్ష్యంగా చేసుకుని ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద కాపు కాచి ప్రత్యేక వాహనంలో వచ్చిన ప్రత్యర్థులు వారిపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో దుర్గ అక్కడికక్కడే మృతిచెందగా కుమారుడు రమేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

Updated Date - 2021-05-15T09:30:36+05:30 IST