‘మీ కుమారుడి వల్ల తల్లినయ్యా.. న్యాయం చేయండి’అని 25ఏళ్ల యువతి అడగ్గా.. ఆ తల్లిదండ్రులు చేసిన నిర్వాకమిది..!
ABN , First Publish Date - 2021-11-07T19:05:10+05:30 IST
మత్తుపదార్థం కలిపిన శీతలపానీయం ఇచ్చి..
ఇంటర్నెట్డెస్క్: మత్తుపదార్థం కలిపిన శీతలపానీయం ఇచ్చి అత్యాచారం చేశాడు. అది ఇంట్లో వాళ్లకి తెలిసింది. కుమారుడిని మందలించాల్సిందిపోయి.. అతడికే వత్తాసు పలికి ఓ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్లోని నాగౌర్ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని గంగానగర్లో నివాసముంటున్న మనోజ్ శర్మ కుమారుడు ప్రతీక్ శర్మకు.. నాగౌర్ పట్టణంలోని 25ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. అదికాస్త స్నేహంగా మారింది. ఈ క్రమంలో, ప్రతీక్ మే ఒకటో తేదీన నాగౌర్కు వచ్చాడు. అక్కడ ఆ యువతిని కలిసి, అనంతరం తనతో పాటు గంగానగర్కు తీసుకెళ్లాడు. గంగానగర్లోని ఓ హోటల్కు తీసుకెళ్లి.. మత్తుపదార్థం కలిపిన శీతలపానీయం ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయాక అత్యాచారం చేశాడు. ఆ సమయంలో కొన్ని ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ యువతికి మెలుకువ రాగానే జరిగిన విషయం తెలిసి తీవ్రంగా దు:ఖించింది. ఎవరికైనా చెబితే నీ మర్యాదే పోతుందని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె భయపడిపోయి విషయం ఎవరికి చెప్పలేదు.
సంఘటన జరిగిన మరుసటి రోజు ప్రతీక్ శర్మ ఆమెకు ఫోన్ చేసి.. రూ.2లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అతడు అడిగినట్లుగానే ఆమె డబ్బులిచ్చింది. కానీ కొన్నిరోజులకు ఆమె గర్భవతి అని తెలిసింది. ప్రతీక్కు ఆ విషయం చెప్పగా తనకేమి సంబంధం లేనట్టు వ్యవహరించాడు. దీంతో ఆమె గంగానగర్లోని ప్రతీక్ శర్మ తల్లిదండ్రలను కలిసింది. వాళ్లింటికి వెళ్లిన తర్వాత ఆమెకు మరో షాకింగ్ సంఘటన ఎదురైంది.
ప్రతీక్ తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించారు. ఆ తర్వాత కుమారుడి దగ్గర ఉన్న అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు చూపించి.. తమకు రూ.20లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారు. ప్రతీక్తో పెళ్లి చేయాల్సిందిపోయి.. డబ్బులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె ఖంగుతింది. ఇక ఆమెకు పోలీసులే దిక్కనుకుని నాగౌర్లోని మహిళా పోలీస్స్టేషన్కు శనివారం వెళ్లి ప్రతీక్పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.