Sonali Phogat Death: సంచలన విషయం బయటపెట్టిన సోనాలి బాడీగార్డ్
ABN , First Publish Date - 2022-08-31T00:26:21+05:30 IST
టి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (Sonali Phogat) హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా..
ఢిల్లీ: నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (Sonali Phogat) హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. సోనాలీ ఫోగట్ మత్తుపదార్ధాలు (intoxicated) తీసుకోవడం తాను ఎప్పుడూ చూడలేదనే సంచలన విషయాన్ని ఆమె బాడీగార్డ్ (Bodyguard) మన్దీప్ (Mandeep) తాజాగా వెల్లడించారు. హర్యానా పోలీసు శాఖ ఆయనను ఫోగట్ బాడీగార్డ్గా నియమించింది.
మన్దీప్ చెప్పిన వివరాల ప్రకారం ఆగస్టు 21న ఫోగట్ మృతికి రెండు రోజుల ముందు ఆమె తన పీఏ సుధీర్ సాంగ్వాన్తో కలిసి గురుగావ్లోని ఫ్లాట్కు వెళ్లింది. ఆగస్టు 26న తనను ఫ్లాట్ వద్ద కలుసుకోమని మన్దీప్కు సాంగ్వాన్ చెప్పారు. కాగా, ఫోగట్ బాడీగార్డ్గా ఐదేళ్లుగా తాను ఉంటున్నాననీ, కానీ తన తోడు లేకుండా గురుగావ్ ఫ్లాట్కు ఆమె వెళ్లడం మాత్రం ఇదే మొదటి సారని తెలిపారు. ఐదేళ్లలో ఒక్కసారిగా కూడా ఆమె తాగడం, మత్తుపదార్ధాలు తీసుకోవడం చూడలేదని చెప్పారు.
ల్యాప్టాప్తో కంప్యూటర్ ఆపరేటర్ మాయం
ఈ కేసులోని ప్రధాన నిందితులలో ఒకరైన సోనాలీ పీఏ సుధీర్ సాంగ్వాన్ కొద్ది రోజుల క్రితం శివం అనే ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించారు. ఫోగట్ ఫాంహౌస్ వద్ద అతనికి పని అప్పగించారు. ఫోగట్ హత్య జరిగిన రోజు ఆమె కార్యాలయం నుంచి ల్యాప్టాప్, సీసీటీవీ రికార్డింగ్లు మాయమయ్యాయి. ఫోగట్ ఆస్తులకు చెందిన కీలకమైన సమాచారం అందులో ఉన్నట్టు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో శివం కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్నారు.