ప్రజా సమస్యలపై పోరాడండి : సోనియా గాంధీ
ABN , First Publish Date - 2020-10-19T01:10:50+05:30 IST
ప్రజాస్వామ్యం సంక్లిష్ట సమయంలో పడిందని, ప్రజల సమస్యలపై
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యం సంక్లిష్ట సమయంలో పడిందని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ నేతలు పోరాడాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు.
ఆదివారం జరిగిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జుల సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడారు. ఈ వివరాలను ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిథి రణదీప్ సుర్జీవాలా ఓ ట్వీట్లో తెలిపారు. మన ప్రజాస్వామ్యం సంక్లిష్ట సమయంలో ఉందని, అందువల్ల ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలు పోరాడాలని సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు తెలిపారు.
బిహార్ శాసన సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ ఈ పిలుపునిచ్చారు.