గంగారాం ఆసుపత్రి నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-08-02T18:59:37+05:30 IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం ఆసుపత్రి నుంచి క్షేమంగా విడుదలయ్యారు.

గంగారాం ఆసుపత్రి నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిశ్చార్జ్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం ఆసుపత్రి నుంచి క్షేమంగా విడుదలయ్యారు. ఆమెను జూలై 30న సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి నుంచి విడుదలయ్యే సమయానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఆమెను సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపింది. 


ఆసుపత్రి మేనేజ్‌మెంట్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా విడుదల చేసిన ప్రకటనలో  ఆసుపత్రి నుంచి విడుదలయ్యే సమయానికి సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. 


సోనియా గాంధీని గురువారం ఆసుపత్రిలో చేర్పించినపుడు కూడా డాక్టర్ డీఎస్ రాణా ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారని చెప్పారు. 


ఫిబ్రవరిలో ఆమెకు పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-08-02T18:59:37+05:30 IST