Sonia gandhi: పంజాబ్ ముఖ్య నేతలకు ఫోన్లు

ABN , First Publish Date - 2021-07-20T01:03:51+05:30 IST

పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా సిద్దూను ప్రకటించే కొన్ని గంటల ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాందీ సీఎం

Sonia gandhi:  పంజాబ్ ముఖ్య నేతలకు ఫోన్లు

న్యూఢిల్లీ : పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా సిద్దూను ప్రకటించే కొన్ని గంటల ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాందీ సీఎం అమరీందర్ సింగ్‌కు ఫోన్ చేశారు. ఆయనతో పాటు పలువురు పంజాబ్ ఎంపీలకు, సీనియర్లకు కూడా ఫోన్ చేశారు. వారి అభ్యంతరాలను సావధానంగా విన్నట్లు తెలుస్తోంది. మనీశ్ తివారీ, ప్రతాప్ సింగ్ బాజ్వా, రవణీత్ బిట్టూ, గుర్జీత్ ఔజలా, అమర్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరందరికీ సోనియా ఫోన్ చేశారు. సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నారని ఖాయమైన నేపథ్యంలో ఎంపీలందరూ సోనియా అపాయింట్‌మెంట్ కోరారు. ఈ నేపథ్యంలోనే సోనియా వారికి ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చివరికి ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 


Updated Date - 2021-07-20T01:03:51+05:30 IST